- Advertisement -
వెస్ట్ప్యాక్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టీ20లో భారత్ ఘోరపరాజయాన్ని చవిచూసింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో రోహిత్ సేన ఘోరంగా తడబడింది. భారత్ 19.2 ఓవరల్లో భారత్ 139 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ 80 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అంతకు ముందు బ్యాటింగ్కు దిగిని కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.
ఓటమితో అంతర్జాతాయ టీ20లో భారత్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ-20 మ్యాచ్లో భారత్ 49 పరుగుల తేడాతో ఓడింది. కాగా నేడు 80 పరుగుల తేడాతో ఓడి.. ఆ రికార్డును అధిగమించింది.