Monday, May 13, 2024
- Advertisement -

మొద‌టి టెస్ట్‌కు ధావ‌న్ ఫిట్‌… కోహ్లీ ఒప్పుకుంటాడా….?

- Advertisement -

శుక్ర‌వారం నుంచి ద‌క్షిణాఫ్రికాతో భార‌త్ మొద‌టి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. స‌ఫారీ గ‌డ్డ చేరుకున్న టీ మిండియా సిరీస్‌ను గెలిచేందుకు ముమ్మ‌ర సాధ‌న చేస్తోంది. అయితే ఓపెనర్ల విష‌యంలో కొంత గంద‌ర‌గోలం ఉండేది. ధావ‌న్‌, పుజారా, ముర‌ళీ విజ‌య్‌ల‌లో ఎవ‌రిని ఓపెన‌ర్‌గా పంపాల‌నే సందిగ్ధం ఉండేది. గాయం కార‌నంగా ధావ‌న్మొద‌టి టెస్టులో ఆడ‌టం అనుమానంగా ఉండేది.

ఇప్పుడు తాజాగా భారత ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం నుంచి కోలుకుని ఫిటెనెస్ సాధించాడా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కేప్ టౌన్ వేదికగా శుక్రవారం నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్‌కి భారత్ సిద్ధమవుతోంది. అయితే.. ఓపెనర్ శిఖర్ ధావన్‌‌ చీలమండలానికి గాయమైందని అతను తొలి టెస్టు ఆడటం అనుమానమే అంటూ గత వారం వార్తలు వచ్చాయి. అతని స్థానంలో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌కి టీమ్ మేనేజ్‌మెంట్ అవకాశం ఇవ్వనున్నట్లు కూడా తెలిసింది. కానీ.. గాయం నుంచి కోలుకున్న ధావన్.. బుధవారం ప్రాక్టీస్ సెషన్‌లో ఉత్సాహంగా కనిపిస్తూ చాలాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.

శిఖర్ ధావన్ నెట్స్‌లో ఈ రోజు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అతను ఏమీ అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించలేదు. ధావన్ చాలా ఉత్సాహంగా అన్ని షాట్లు ఆడుతూ కనిపించాడు. అయితే.. తొలి టెస్టు తుది జట్టు ఎంపిక నిర్ణయం పూర్తిగా కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రధాన కోచ్ రవిశాస్త్రిదే’ అని టీమిండియా మేనేజ్‌మెంట్ అధికారి ఒకరు తెలిపారు.

గత ఏడాది శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో భారీ స్కోర్లు సాధించిన ధావన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే.. గాయం నుంచి కోలుకున్న ధావన్‌కి కోహ్లి అవకాశం ఇస్తాడా..? లేదా విశ్రాంతి పేరుతో రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేస్తాడో శుక్రవారమే తేలనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -