Saturday, May 4, 2024
- Advertisement -

రెండో టెస్టులో టీమిండియా గెలుపు

- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. సఫారీలు విధించిన 79 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కొల్పోయి 12 ఓవర్లలో చేధించింది. జైస్వాల్ 28,గిల్ 10,విరాట్ 12 పరుగులు చేయగా రోహిత్ శర్మ 17 నాటౌట్‌,శ్రేయాస్ 4 నాటౌట్‌గా నిలిచారు.

ఇక అంతకముందు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 36.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్‌ ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ 103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్స్‌లతో 106 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 6 వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 6 వికెట్లు తీసి సఫారీల పతనాన్ని శాసించాడు. ముఖేశ్‌ కుమార్‌ రెండు వికెట్లు , సిరాజ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. ఈ గెలుపుతో సిరీస్‌ని సమం చేసింది టీమిండియా.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌:55
భారత్ తొలి ఇన్నింగ్స్:153
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్:176
భారత్ రెండో ఇన్నింగ్స్:80/3

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -