వెస్టిండీస్తో జరుగుతన్న సుదీర్ఘ సిరీస్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారతజట్టు, 3-1 తేడాతో వన్డే సిరీస్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్లో రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఇరు జట్ల మధ్య ఈ రోజే(ఆదివారం) నుంచి ప్రారంభం కానున్న టీ 20 సిరీస్ కు భారత జట్టు సిద్ధమవుతోంది. మూడు టీ 20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఈ రోజు(ఆదివారం) కోల్ కతా వేదికగా జరగనుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఈ సిరీస్ నుంచి విరాట్ కోహ్లీకి విశ్రాంతి నివ్వడంతో.. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది. ప్రస్తుతం టీ 20 ఛాంపియన్ గా ఉన్న వెస్టిండీస్ జట్టు తన ఆధిక్యాన్ని నిలుపుకోవాలని చూస్తోంది. టెస్ట్, వన్డే సిరీస్ లు ఓడిన వెస్టిండీస్ జట్టు.. టీ20 ఫార్మాట్ లోనైనా భారత్ పై ఆధిక్యం సాధించాలని కృషి చేస్తోంది. 2009-2017 మధ్య ఇరు జట్ల మధ్య 8 టీ20 మ్యాచ్ లు జరగగా, విండీస్ ఐదింటిలో, భారత్ రెండింటిలోనూ నెగ్గాయి.