వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్లో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా శతకం పూర్తి చేసుకున్నాడు. 132 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. దీంతో భారత్ 9 వికెట్ల నష్టానికి 649 పరుగులు చేసిన టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసంది.
భారత ఇన్నింగ్స్ లో పృథ్వీ షా (134), కోహ్లీ (139), జడేజా (100)లు సెంచరీలు సాధించారు. మిడిల్ ఆర్డర్ లో జడేజా సత్తా చాటి 132 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇతర బ్యాట్స్ మెన్లలో పుజారా 86, రహానే 41, పంత్ 92, అశ్విన్ 7, కుల్దీప్ యాదవ్ 12, ఉమేష్ యాదవ్ 22 పరుగులు చేశారు. మొహమ్మద్ షమీ 2 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో బిషూ 4 వికెట్లు, లూయిస్ 2 వికెట్లు పడగొట్టగా… గాబ్రియెల్, ఛేస్, బ్రాత్ వైట్ లు చెరో వికెట్ తీశారు.
And, here comes the maiden Test 💯 for @imjadeja, followed by the declaration by the Indian Captain.#TeamIndia 649/9d
Live – https://t.co/RfrOR7MGDV @Paytm #INDvWI pic.twitter.com/iaanoBmcp4
— BCCI (@BCCI) October 5, 2018