వెస్టిండీస్తో బ్రబౌర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (162; 137 బంతుల్లో 29×4, 4×6), అంబటి రాయుడు (100; 81 బంతుల్లో 8×4, 4×6) చెలరేగి ఆడటంతో ప్రత్యర్థికి 378 పరుగుల లక్ష్యం నిర్దేశించింది.
రోహిత్ శర్మ 162, రాయుడు 100 పరుగులతో స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. ఇండియన్ బ్యాట్స్ మెన్లలో ధావన్ 38, కోహ్లీ 16, ధోనీ 23, జాధవ్ 16, జడేజా 7 పరుగులు చేశారు. జాధవ్, జడేజాలు నాటౌట్ గా నిలిచారు. విండీస్ బౌలర్లలో రోచ్ 2 వికెట్లు, నర్స్, కీమో పాల్ చెరో వికెట్ తీశారు.
ఓపెనర్ శిఖర్ ధావన్ (38: 40 బంతుల్లో 4×4, 2×6), కెప్టెన్ విరాట్ కోహ్లి (16: 17 బంతుల్లో 2×4) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా.. మూడో వికెట్కి రోహిత్ – రాయుడు జోడీ అభేద్యంగా 211 పరుగుల భాగస్వామ్యంతో భారత్ జట్టుని తిరుగులేని స్థితిలో నిలిపింది. మ్యాచ్ లో వన్డేల్లో రోహిత్ శర్మ 21వ సెంచరీ చేయగా, రాయుడు మూడో శతకాన్ని నమోదు చేశాడు. 81 బంతుల్లో 100 పరుగులు చేసిన రాయుడు రనౌట్ గా వెనుదిరిగాడు.