Monday, April 29, 2024
- Advertisement -

రెండో టెస్ట్‌కు భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌..తెలుగు ఆట‌గాళ్ల‌కు ద‌క్క‌ని చోటు

- Advertisement -

వెస్టిండీస్‌తో హైదరాబాద్‌‌లోని ఉప్పల్ వేదికగా శుక్రవారం నుంచి జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌ కోసం సెలక్టర్లు ఈరోజు భారత జట్టుని ప్రకటించారు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో ఆడిన జట్టునే హైదరాబాద్ టెస్ట్‌లోనూ కొనసాగించాలని నిర్ణయించింది. మొద‌టి టెస్టులో విస్టీండిస్‌పై భార‌త్ భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెల‌సిందే.

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్థానంలో యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌కు అవకాశం కల్పిస్తారని భావించినా జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. కనీసం రెండో టెస్టులోనైనా అవకాశం దక్కుతుందని ఆశించిన హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఆంధ్రా క్రికెటర్‌ హనుమ విహారి, యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌‌కి నిరాశ తప్పలేదు.

రాజ్‌కోట్ టెస్టులో శతకం బాదిన ఓపెనర్ పృథ్వీ షా జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. డకౌటైనప్పటికీ మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌కి మరో అవకాశం దక్కింది. అయితే.. తొలి టెస్టులో విఫలమైన ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలో ఒకరిపై వేటు పడుతుందని అంతా భావించారు. కానీ.. వారిని అలానే కొనసాగించిన సెలక్టర్లు.. శార్ధూల్ ఠాకూర్‌ని కూడా జట్టులోకి చేర్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -