Friday, April 19, 2024
- Advertisement -

పొలార్డ్‌పై వ్యంగాస్త్రాల‌ను సందిస్తున్న భార‌త అభిమానులు

- Advertisement -

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం విదితమే. ఈ గెలుపుతో భారత్ టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. విండీస్ బ్యాట్స్ మన్ పొలార్డ్ ఆడిన ఆటతీరు ఇప్పుడు తీవ్ర విమర్శలపాలైంది. లక్నో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో భారత బౌలర్ బుమ్రా వేసిన బంతిని విండీస్ బ్యాట్స్‌మన్ పొలార్డ్ ఆడగా, బంతి బ్యాట్‌కు తాకి గాల్లోకి లేచింది. దీంతో బుమ్రా క్యాచ్ పట్టాడు. అయితే బుమ్రా క్యాచ్ పడుతుండగా, అతని దృష్టి మరల్చేందుకు పొలార్డ్ చేతిని పైకి లేపాడు.

అప్పటికీ బుమ్రా బంతిని ఒడుపుగా పట్టుకుని పొలార్డ్ వైపు ఆగ్రహంగా చూడగా, పొలార్డ్ నవ్వుతూ పెవీలియన్ కు వెళ్లాడు. ఈ వీడియో సోషియ‌ల్ మీడియ‌లో వైర‌ల్ అవ‌డంతో పొలార్డ్ చేసిన పనికి భారత అభిమానులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొండి ఆట ఆడుతున్నావ్.. అంటూ విమర్శిస్తున్నారు.

https://twitter.com/NaaginDance/status/1059844978665381888

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -