భవిష్యత్తులో టీమిండియాకు కోచ్గా రాబోతారా..? భారత మహిళల క్రికెట్ జట్టు సారథి మిథాలీకదా…! ఇప్పుడు కోహ్లీ సేనకు కోచ్ ఏంటి అని అనుకుంటున్నారా..? అసలు విషయానికి వస్తే…బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తాజాగా మిథాలీ రాజ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ నేపథ్యంలో మిథాలీని భారత పురుషుల జట్టు ప్రధాన కోచ్గా చూడాలనుకుంటున్నాం అని అన్నాడు. ఇంతకీ ఈ ప్రశ్నకు మిథాలీ సమాధానం ఇచ్చింది.
భారత పురుషుల క్రికెట్ జట్టుకి ఒకవేళ తనని కోచ్గా నియమిస్తే.. వెనక్కి తగ్గకుండా అత్యుత్తమంగా పనిచేస్తానని భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ వెల్లడించారు. ఓ టీవీ ‘షో’లో భాగంగా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ అడిగిన ప్రశ్నకి మిథాలీ పైవిధంగా సమాధానమిచ్చారు. గత ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్లో మిథాలీ రాజ్ సారథ్యంలోని భారత మహిళల జట్టు ఫైనల్కి చేరిన విషయం తెలిసిందే.
‘మైదానంలో ఎప్పుడూ కూల్గా ఉంటారు.. ఎలా సాధ్యం..?’, ‘నాకు మిమ్మల్ని భారత పురుషుల క్రికెట్ జట్టుకి కోచ్గా చూడాలని ఉంది’ అని షారూక్ సరదాగా మిథాలీని అడిగారు. ‘మ్యాచ్ సమయంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు నేను పుస్తకాలు చదువుతా. బుక్స్ నాలో ప్రశాంతతని పెంచి.. మెరుగైన ప్రదర్శన చేసేందుకు దోహదపడతాయి. ఇక భారత పురుషుల క్రికెట్ జట్టుకి కోచ్గా అంటారా..? ఒకవేళ అవకాశం దొరికితే అత్యుత్తమంగా పనిచేస్తా’ అని మిథాలీ ధీమా వ్యక్తం చేశారు.
‘టెడ్ టాక్స్ ఇండియా నయీ సోచి’ కార్యక్రమానికి షారుక్ ఖాన్ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్నారు. మిథాలీరాజ్ను ఇంటర్వ్యూ చేసిన ఈ ఎపిసోడ్ ఈ నెల 7న ప్రసారం కానుంది.