టీమిండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. అయితే శార్దూల్ తండ్రి పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్-11 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఆడుతున్న శార్దూల్.. ఘటన గురించి తెలుసుకున్న వెంటనే పుణే నుంచి బయలుదేరి ముంబైలోని లీలావతి ఆస్పత్రికి వచ్చాడు.
మహారాష్ట్ర పాల్ఘాట్ లోని అల్యాలిలో ఓ వివాహ వేడుకకు శార్దూల్ తల్లిదండ్రులు నరేంద్ర ఠాకూర్, హౌన్సా హాజరయ్యారు. వేడుక ముగిసిన తర్వాత నిన్న రాత్రి వారు తిరుగుపయనమయ్యారు. ఈ సందర్భంగా వీరు ప్రయాణిస్తున్ బైక్ స్కిడ్ అయింది. నిర్మాణంలో ఉన్న భవనం పక్క నుంచి వెళుతుండగా… వీధి దీపాలు లేకపోవడంతో వీరు ప్రమాదానికి గురయ్యారు.
ప్రమాదంలో శార్దూల్ తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. అతని మెదడులో రక్తం గడ్డ కట్టిందని డాక్టర్లు తెలిపారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. గతంలోనే ఆయనకు రెండు హార్ట్ సర్జరీలు అయ్యారు. మరోవైపు శార్దుల్ తల్లి హౌన్సాకు స్వల్ప గాయాలయ్యారు. చికిత్స అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేశారు.