- Advertisement -
జింబాబ్వే తో మూడు ట్వంటీ 20లు, మూడు వన్డే మ్యాచ్ లు ఆడేందుకు వెళ్తున్న భారత క్రికెట్ జట్టుకు కోచ్ గా ప్రముఖ క్రికెటర్ , భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ ఎంపికయ్యారు.
జూన్ 11 నుంచి ఈ సీరిస్ ప్రారంభం కానుంది. ఈ సీరిస్ కు బౌలింగ్ కోచ్ గా ఉన్న భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ లకు టీమ్ సహాయ సిబ్బంది జాబితాలో చోటు దక్కలేదు. అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గా మాజీ క్రికెటర్, ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ కార్యాదర్శి కోకా రమేష్ ను నియమించినట్లు బిసిసిఐ తెలిపింది.
భారత జట్టు పూర్తి కోచ్ గా దరఖాస్తు చేసుకుందుకు జూన్10ని ఆఖరి తేది గా బిసిసిఐ చైర్మన్ కొత్త చైర్మన్ అనురాగ్ శర్మ ప్రకటించారు.