Wednesday, April 24, 2024
- Advertisement -

కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్ అవార్డ్‌….

- Advertisement -

టీమిండియా కెప్టెన్ కోహ్లీ మరో అరుదైన అవార్డు దక్కింది. 2017కు గాను ప్రకటించిన అవార్డుల్లో విరాట్‌ అకౌంట్ మోస్ట్ ఎంగేజ్డ్‌గా సెలక్ట్ అయ్యింది. ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రాం తాజాగా కొన్ని అవార్డులు ప్రకటించింది. అందులో ‘మోస్ట్‌ ఎంగేజ్డ్‌ అకౌంట్‌’ అవార్డును కోహ్లీ సొంతం చేసుకున్నాడు. 2017 ఏడాదికి గాను ఇన్‌స్టాగ్రాం ఈ అవార్డులను ప్రకటించింది.

విరాట్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తన ఎంజాయ్‌మెంట్‌ను పంచుకుంటుంటాడు. అంతేకాదు టీమిండియా కెప్టెన్ అకౌంట్‌కు రెండు కోట్లమంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. అలా పోస్ట్ పెట్టాడో లేదో… ఇలా లక్షల్లో లైక్‌లు, కామెంట్లు వచ్చేస్తుంటాయి. ఇలా ఎక్కువగా యాక్టివ్‌గా ఉండి… లైక్‌లు, కామెంట్లు ఉంటే ఆ అకౌంట్లను మోస్ట్ ఎంగేజ్డ్‌గా సెలక్ట్ చేస్తారు. అలాగే విరాట్‌కు ఈ అవార్డు దక్కింది.

మోస్ట్ ఫాలోవుడ్ అకౌంట్‌గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే ఉన్నారు. ఎమర్జింగ్ అకౌంట్‌గా ఇషాన్ ఖత్తార్ అవార్డు దక్కించుకున్నారు. అలాగే అలియా భట్, శ్రద్ధా కపూర్‌కు కూడా అవార్డులు వచ్చాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -