Wednesday, May 15, 2024
- Advertisement -

కెప్టెన్ ధోనీని మళ్లీ కలుస్తున్నందుకు సంతోషంగా ఉంది .. బ్రావో

- Advertisement -

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ తాను చూసిన అన్ని ఫ్రాంఛైజీల కంటే బెస్ట్ అని వెస్టిండీస్ సీనియర్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అభిప్రాయపడ్డాడు. గత వారం బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ 2018 ఆటగాళ్ల వేలంలో రూ. 6.4 కోట్లకి డ్వేన్ బ్రావోని ‘రైట్ టు మ్యాచ్’ పద్ధతి ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే.

సుదీర్ఘకాలంగా చెన్నైకి ఆడుతున్న బ్రావో.. ఐపీఎల్‌లో ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ అందించే క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. వికెట్లు తీసినప్పుడు, క్యాచ్ పట్టినప్పుడు మైదానంలో బ్రావో చేసే డ్యాన్స్‌ గత కొన్ని సీజన్లుగా అభిమానుల్ని ఫిదా చేస్తోంది. వేలంలో తనని మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేయడంపై బ్రావో ఆనందం వ్యక్తం చేశాడు.

మళ్లీ పసుపు రంగు జెర్సీ ధరించి మైదానంలో దిగేందుకు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. నాతో పాటు అభిమానులు కూడా.. చెన్నై పునరాగమనం కోసం వేచి చూస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ వేలంలో నన్ను కొనుగోలు చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఐపీఎల్ సీజన్‌ సన్నద్ధతలో భాగంగా త్వరలోనే మా చెన్నై కెప్టెన్ ధోనీని కలవనున్నా’ అని బ్రావో వివరించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -