Friday, April 19, 2024
- Advertisement -

2019 వ‌రల్డ్‌క‌ప్‌లో చోటుకు రైనాకు ఇదే మంచి ఛాన్స్ …

- Advertisement -

దాదాపు రెండు సంవ‌త్స‌రాల త‌ర్వా భారత జట్టులోకి ఇటీవల పునరాగమనం చేసిన సురేశ్ రైనా.. ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గత వారం ముగిసిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు రైనా ఆడిన సంగ‌తి తెలిసిందే.

ఏప్రిల్ 7 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 2018 సీజన్‌లో అత్యుత్తమంగా ఆడి.. వన్డే జట్టులోనూ చోటు దక్కించుకోవాలని సురేశ్ రైనా యోచిస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌తో భారత్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది.

ఇక ద‌క్ష‌ణిఫ్రికాతో టీ20 సిరీస్‌తోపాటు ఇటీవల ముక్కోణపు టీ20 సిరీస్‌లో కూడా మెరుగ్గా రాణించ‌డంతో టీ20 జ‌ట్టులో రైనాస్థానానికి ఢోకాలేదు. అయితే వన్డే జట్టులో స్థానంపై కన్నేసిన రైనా.. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకోవాలని ఆశిస్తున్నాడు.

ఇప్పటికే జట్టు మిడిలార్డర్‌లో మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ రూపంలో తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో.. ఐపీఎల్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి.. సెలక్టర్ల దృష్టిలో పడాలని రైనా యోచిస్తున్నాడు. ఈ క్రమంలోనే నెట్స్‌లో ఎక్కువగా హిట్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -