ఐపీఎల్ 2018 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లాడిన బెంగళూరు జట్టు కేవలం రెండింటిలో మాత్రమే గెలుపొంది పాయింట్ల పట్టికలో ఆరో స్థానం ఉండగా.. ఆడిన ఐదు మ్యాచ్ల్లో.. నాల్గింటిలో గెలుపొందిన చెన్నై జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది.
రెండు జట్లూ రెండేసి మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. బెంగుళూరు టీంలో పవన్ నెగి స్థానంలో మనన్ వోహ్రాను తీసుకోగా, క్రిస్ వోక్స్ స్థానంలో కొలిన్ డి గ్రాండ్హోమ్ ఆడుతున్నాడు. అలాగే చెన్నై టీంలో కరణ్ శర్మ, ఫఫ్ డుప్లెసిస్లకు బదులుగా హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్లు ఆడుతున్నారు.
బెంగళూరు జట్టు: డికాక్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, మన్దీప్ సింగ్, కోరె అండర్సన్, గ్రాండ్ హోమ్, వాషింగ్టన్ సుందర్, పవన్ నేగి, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, చాహల్
చెన్నై జట్టు: షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, శామ్ బిల్లింగ్స్, మహేంద్రసింగ్ ధోని, డ్వేన్ బ్రావో, జడేజా, హర్భజన్ సింగ్, దీపక్ చాహర్, శార్ధూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్