బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకుని నిషేధానికి గురైన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్కు కూడా దూరమైన సంగతి తెలిసిందే. కెప్టెన్గా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును విజయపథంలో నడిపించారు. అయితే వార్నర్ ఆస్ట్రేలియాలో ఉన్నా మనసు మాత్రం హైదరాబాద్లోనే ఉంది. తన జ్ణాపకాలను మరచిలేకపోతున్నారు.
నేడు సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా సొంత జట్టు సన్రైజర్స్కు డేవిడ్ వార్నర్ ట్విట్టర్ ద్వారా గుడ్లక్ చెప్పారు..
‘నా మిత్రులకు గుడ్ లక్. ఈ రోజు రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్ బాగా ఆడాలి’ అని వార్నర్ ఆకాక్షించాడు. ఇక వార్నర్ ట్వీట్కు అభిమానులు ఫిదా అయిపోయారు. ‘మిస్ యూ’ వార్నర్ అంటూ రిప్లైలు ఇస్తున్నారు. ‘కనీసం మ్యాచ్ చూడటానికైనా హైదరాబాద్ రా’ అని కోరుతున్నారు.
Good luck to my friends @SunRisers play well tonight. pic.twitter.com/GpYYLDLXeJ
— David Warner (@davidwarner31) April 9, 2018
ఇదిలా ఉంటే, సన్రైజర్స్ హైదరాబాద్ కూడా అభిమానుల కోసం తెలుగులో ట్వీట్ చేసింది. ‘నమస్తే హైదరాబాదీస్. ఈ రోజు మన సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉంది. అందరూ రావాలె. మన ఆరెంజ్ ఆర్మీకి ధూంధూం సపోర్ట్ చేయాలె. గో ఆరెంజ్ ఆర్మీ గో’ అంటూ సన్రైజర్స్ ట్వీట్లో పేర్కొంది. కాగా, ఐపీఎల్ 2018 సీజన్లో భాగంగా నేటి సాయంత్రం జరగనున్న నాలుగో మ్యాచ్లో హైదరాబాద్, రాజస్థాన్ తలపడుతున్నాయి. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్కు వేదిక కానుంది.
నమస్తే హైదరాబాదీస్, ఈరోజు మన #SunrisersHyderabad మ్యాచ్ ఉంది. అందరూ రావాలె, మన Orange Armyకి ధూంధాం సపోర్ట్ చెయ్యాలె. Go #OrangeArmy Go!
— SunRisers Hyderabad (@SunRisers) April 9, 2018