Thursday, May 9, 2024
- Advertisement -

టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న గంభీర్ సేన‌..

- Advertisement -

వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబయి ఇండియన్స్ జట్టు సొంతగడ్డపై మరోపోరాటానికి సిద్ధమైంది. వాంఖడే స్టేడియంలో ముంబయితో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ గౌతం గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గంభీర్ నేతృత్వంలోని ఢిల్లీ సైతం ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. సొంత అభిమానుల మధ్య మునుపటి జోరు కొనసాగించాలని రోహిత్‌సేన భావిస్తోంది. ఇరు జట్లు విజయం కన్నేసిన నేపథ్యంలో పోరు ఆసక్తికరంగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
.
ఇరు జట్లూ రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. ముంబయి జట్టులోకి బెన్ ‌కటింగ్ స్థానంలో అఖిల ధనంజయ, ప్రదీప్ సంగ్వాన్ స్థానంలో హార్దిక్ పాండ్య‌కి కెప్టెన్ రోహిత్ శర్మ చోటిచ్చాడు. ఢిల్లీ జట్టు ఓపెనర్ కొలిన్ మున్రో స్థానంలో జేసన్ రాయ్, క్రిస్ మోరీస్ స్థానంలో క్రిస్టియాన్‌కి అవకాశమిచ్చింది.

ముంబయి జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఎవిన్ లావిస్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, క్రునాల్ పాండ్య, కీరన్ పొలార్డ్, మార్కండే, జస్‌ప్రీత్ బుమ్రా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, అఖిల ధనంజయ

ఢిల్లీ డేర్‌డెవిల్స్ : జేసన్ రాయ్, గౌతమ్ గంభీర్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, మాక్స్‌వెల్, విజయ్ శంకర్, క్రిస్టియాన్, రాహుల్ తెవాటియా, నదీమ్, మహ్మద్ షమీ, ట్రెంట్ బౌల్ట్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -