- Advertisement -
ఐపీఎల్ 2018 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్డెవిల్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గత ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అనూహ్యంగా ఓటమి చవిచూసిన ఢిల్లీ జట్టు టోర్నీలో బోణి కొట్టాలని ఆశిస్తుండగా.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఘోర పరాజయం చవిచూసిన రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం ఒత్తిడిలో బరిలోకి దిగుతోంది.