Sunday, May 12, 2024
- Advertisement -

టాస్ గెలిచి ముంబ‌య్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్

- Advertisement -

ఐపీఎల్ 2018 సీజన్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో 9 మ్యాచ్‌లాడిన ముంబయి ఇండియన్స్ జట్టు మూడింట్లో మాత్రమే గెలుపొంది పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుండగా.. ఐదు విజయాలతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు మూడో స్థానంలో ఉంది.

టోర్నీలో భాగంగా గత శుక్రవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో 175 పరుగుల లక్ష్యాన్ని మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన ముంబయి జట్టు.. ప్లేఆఫ్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ముంబయి జట్టు ఓడితే.. ప్లేఆఫ్ ఆశలకి దాదాపు తెరపడినట్లే.

మరోవైపు కోల్‌కతా జట్టు గత గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌పై అద్భుత విజయంతో మళ్లీ గెలుపు బాట పట్టింది. ఆ మ్యాచ్‌లో 178 పరుగుల లక్ష్యాన్ని మరో 14 బంతులు మిగిలి ఉండగానే ఆడుతూ పాడుతూ ఛేదించేసింది. యువ హిట్టర్ శుభమన్ గిల్, కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫామ్‌‌ని కొనసాగిస్తుండటం.. బౌలింగ్‌లో సునీల్‌ నరైన్, పీయూస్ చావ్లా, కుల్దీప్‌లు మెరుస్తుండటంతో కోల్‌కతా జట్టు మంచి జోరుమీదుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -