- Advertisement -
ఐపీఎల్ 2018 సీజన్ అంగరంగ వైభవంగా వచ్చే నెలలో ఆరంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాలికలు సిద్ధం చేసింది. వాంఖడే వేదికగా ఏప్రిల్ 7న సాయంత్రం ఈ ఆరంభోత్సవం జరగనుండగా.. అనంతరం రాత్రి 8 గంటలకి ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఈ ఆరంభోత్సవ వేడుకలకు ఊపు తెచ్చేందుకు రణవీర్ సింగ్, వరుణ్ ధావన్, జాక్వెలైన్ ఫెర్నాండేజ్, పరిణీతి చోప్రాతో పాటు తమన్నా కూడా డ్యాన్స్ చేయనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఆరంభోత్సవం ద్వారా యువతని ఆకర్షించగలిగితే.. టోర్నీ ఆదరణకి ఢోకా ఉండదు. అందుకే.. బాలీవుడ్ స్టార్స్తో ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నాం. గత ఏడాది ఎనిమిది వేదికల్లో ఆరంభోత్సవాల్ని ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.