ఐపీఎల్ 2018 ప్రారంభ వేడుకలకు ముంబైలోని వాంఖడే స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ఈ వేడుకల్లో బాలీవుడ్ నటీనటులు అలరించబోతున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం రణ్వీర్ సింగ్, పరిణీతి చోప్రా, వరుణ్ ధావన్, జాక్వలిన్ ఫెర్నాండెజ్లు స్టేజీపై తమ ప్రదర్శన ఇవ్వాల్సిఉంది. ఇప్పటికే గాయం కారణంగా రణ్వీర్సింగ్ ఐపీఎల్ ప్రారంభ వేడుకల నుంచి తప్పుకోవడంతో హృతిక్ రోషన్ పాల్గొంటున్న విషయం తెలిసిందే.
తాజాగా మరో తార కూడా ఐపీఎల్ వేడుకలకు దూరమైనట్లు తెలుస్తోంది. వరుస సినిమా షూటింగ్లతో బిజీగా గడుపుతోన్న పరిణీతికి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేందుకు సమయం దొరకడం లేదట. ఈ కారణంగానే ఆమె ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు. దీంతో ఐపీఎల్ నిర్వాహకులు ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నారు. వరుణ్ ధావన్, జాక్వలైన్ ఫెర్నాండేజ్, తమన్నా ఇప్పటికే డ్యాన్స్ ప్రాక్టీస్తో బిజీగా గడుపుతున్నారు.
మరీ ఐపీఎల్ నిర్వాహకులు పరిణీతి చోప్రా విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. పరిణీతి పాల్గోనకపోతే ఈ వేడుకకి గ్లామర్ తగ్గిపోతదనే ఆలోచనలో ఐపీఎల్ నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది.