ముంబయ్ కెప్టెన్ రోహిత్ శర్మా హైదరాబాద్పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లలో ప్రస్తుత ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఒకడు. హైదరాబాద్ బేస్డ్ దక్కన్ ఛార్జర్స్ జట్టుతోనే రోహిత్ శర్మ ఐపీఎల్(2008) ప్రయాణం మొదలైంది. ఉప్పల్లో హిట్మ్యాన్కు మంచి రికార్డే ఉంది. కెరీర్ ఆరంభంలో ఐపీఎల్లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు. గతంలో దక్కన్ ఛార్జర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన రోహిత్ ముంబయి ఇండియన్స్ జట్టుపై హ్యాట్రిక్ కూడా నమోదు చేయడం విశేషం. . రోహిత్ తల్లిది ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ నగరం. ఈ నేపథ్యంలో సుధీర్ఘకాలం నుంచే తెలుగు అభిమానులతో అతనికి మంచి అనుబంధం ఉంది.
సన్రైజర్స్తో గురువారం మ్యాచ్ ఆడేందుకు భాగ్యనగరానికి వచ్చిన రోహిత్ తన గత అనుభవాలను పంచుకున్నాడు. హైదరాబాద్ సిటీ అంటే నాకెంతో ఇష్టం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ నగరంతో గొప్ప అనుబంధం ఉంది. హైదరాబాద్(దక్కన్ ఛార్జర్స్) జట్టు తరఫున ఆడిప్పుడు ఎన్నో గొప్ప మధురానుభూతులను సృష్టించాం. గతేడాది ఐపీఎల్ ట్రోఫీని ఇక్కడే నెగ్గాం. అదే ఉత్సాహాన్ని మరోసారి నేటి మ్యాచ్లో కొనసాగించాలనుకుంటున్నామని రోహిత్ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. ఈ వీడియోను మీరు చూడండి.
.@ImRo45‘s special connection, couple of players with inside access and fond memories from this ground 🙌
Watch out Orange Army, our boys are here to paint the town blue and gold. 😏#SRHvMI #CricketMeriJaan pic.twitter.com/BiTE4etLPF
— Mumbai Indians (@mipaltan) April 12, 2018