ఐపీఎల్ 2018 సీజన్ శనివారం నుంచే ప్రారంభంకాబోతోంది. వాంఖడే వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్తో రాత్రి 8 గంటలకి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టోర్నీ తొలి మ్యాచ్లో ఢీకొట్టనుంది. ఈ ఏడాది ముంబయి జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో అభిమానులు ఊహించని మార్పు చోటుచేసుకోబోతోందని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు
గత రెండు ఐపీఎల్ సీజన్లలో మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన రోహిత్ శర్మ.. ఈ ఏడాది లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. గత ఏడాది ఫైనల్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్పై గెలిచిన ముంబయి మూడోసారి టైటిల్ గెలుపొందిన విషయం తెలిసిందే.
ఈ సీజన్ లో ఓపెనర్లుగా ఎల్విన్ లూయిస్ (వెస్టిండీస్), ఇషాన్ కిషన్ లు రానున్నారని చెప్పాడు. దీంతో నేను ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఇదే నేను అభిమానులకిచ్చే సర్ప్రైజ్. ముంబై గొప్ప ఆటగాళ్లతో కూడిన ఓ అద్భుతమైన జట్టు. బయట ఏం జరుగుతోంది మాకు అనవసరం జట్టుగా ముందుకెళ్లి లక్ష్యాన్ని సాధించడమే మా పని. ఈ స్పూర్తినే మేం గత పదేళ్లుగా కొనసాగించి విజయవంతమయ్యాం’. అని పేర్కొన్నాడు
ఐపీఎల్ లో ఓపెనింగ్, పించ్ హిట్టింగ్ కీలకమన్న సంగతి తెలిసిందే. అలాగే మిడిల్ ఆర్డర్ కూడా బలంగా ఉందని చెప్పాడు. రేపటి మ్యాచ్ లో తమపై ఎలాంటి ఒత్తిడి లేదని రోహిత్ అన్నాడు. జట్టు ప్రదర్శనపై ఆందోళన లేదని, తమ జట్టు సమతూకంగా ఉందని తెలిపాడు.