ఐపీఎల్-12లో భాగంగా ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ x చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానున్న నేపధ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం కానున్నాడు. తన నాయనమ్మ మరణ వార్త తెలియగానే వెంటనే న్యూజిలాండ్ బయలుదేరి వెళ్లాడు. జైపూర్ వేదికగా ఈనెల 27న రాజస్థాన్ రాయల్స్తో పోరుకు అతడు అందుబాటులో ఉంటాడని సన్రైజర్స్ మేనేజ్మెంట్ పేర్కొంది.
సీజన్లో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. భుజం గాయం కారణంగా కేన్ దూరమైతే.. సీజన్ ఆరంభంలో టీమ్కు సారథిగా వ్యవహరించిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మళ్లీ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. అన్ని రంగాల్లో బలంగా ఉన్న చెన్నై టీమ్ను దాని సొంతగడ్డపై ఎదుర్కొనే సమయంలో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిసున్న ఆటగాడు దూరం కావడం సన్రైజర్స్కు పెద్ద ఎదురుదెబ్బే