Monday, April 29, 2024
- Advertisement -

ఇవాళ కూడా వర్షం పడితే.. ఆ జట్టే ఛాంపియన్‌..

- Advertisement -

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‍కు సిద్దమైన విషయం తెలిసిందే. నిన్న వర్షం కారణంగా వాయిదా పడింది. ఐపీఎల్‌ చరిత్రలో మొదటి సారి రిజర్వ్ డే మ్యాచ్ నేడు రాత్రి 7.30 గంటలకు జరగనుంది. నిన్న టికెట్ తీసుకున్న ప్రక్షకులకు నేడు మ్యాచ్ చూసే అవకాశం కల్పించారు.

ఈ రోజు కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇవాళ కూడా వర్షం అంతరాయం కలిగిస్తే… మొదటగా ఐదు ఓవర్ల మ్యాచ్‍ను నిర్వహిస్తారు. ఇది కూడా సాధ్యం కాకపోతే.. సూపర్ ఓవర్‍ను ఎంచుకుంటారు. సూపర్ ఓవర్‍ కూడా సాధ్యం కాకపోతే మ్యాచ్‍ను మొత్తంగా రద్దు చెసి లీగ్ స్టేజీలో గ్రూప్ టాపర్‍గా ఉన్నా గుజరాత్ టైటాన్స్ విజేతగా ప్రకటిస్తారు.

చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి కప్పును తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తుండగా.. వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలవాలనే ఉద్దేశ్యంతో గుజరాత్‌ రంగంలోకి దిగుతుంది. చూడాలి వరుణ దేవుడు కరుణిస్తాడా లేదా….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -