భారత్ క్రికెట్ అభిమానులకు సచిన్ దేవుడు కావచ్చు. కాని సచిన్ గొప్ప కెప్టెన్గా మాత్రం సక్సెస్ కాలేదు.ఇప్పుడు దీని గురించి చర్చ ఎందుకు అనుకుంటున్నారా! ఏం లేదండీ …భారత జట్టు వెటరన్ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిమానులకి ఓ సరదా ప్రశ్న సంధించాడు.సోషల్ మీడియాలో ముగ్గురు క్రికెటర్లకి చెందిన అభిమానులు పెద్ద ఎత్తున చర్చకి తెరలేపారు.భారత్ క్రికెట్ ఎదుగుదలకి కారణం ఏమిటి..?’ అని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేయగా.. సౌరవ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లి అంటూ ఎవరికి వారు తమ అభిమాన క్రికెటర్లకి మద్దతు తెలుపుతూ రిప్లై ఇస్తున్నారు.
భారత జట్టుకి దూకుడు నేర్పిన కెప్టెన్గా సౌరవ్ గంగూలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. 28 ఏళ్ల తర్వాత భారత్కి ప్రపంచకప్ అందించడమే కాకుండా.. కెప్టెన్గా ఒక టీ20 ప్రపంచకప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన ఘనత మహేంద్రసింగ్ ధోనీది.బ్యాటింగ్ మెరుపులతో క్రికెట్ ప్రపంచాన్నే తనవైపు తిప్పుకున్న విరాట్ కోహ్లీ. చివరికి ఈ ముగ్గురు ఆటగాళ్లు రేస్లో నిలిచారు.ఆభిమానుల కూడా ఈ ముగ్గురికే ఎక్కువ మద్ధతు తెలిపారు.దీంతో ఈ ముగ్గురు క్రికెటర్ల అభిమానుల మధ్యే సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
Question for all the lovers of Indian cricket. What is the reason behind the rise of Indian cricket?
— Irfan Pathan (@IrfanPathan) February 20, 2018