Friday, April 26, 2024
- Advertisement -

సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న సైనా నెహ్వాల్

- Advertisement -

ఇండియ‌న్ బ్యాడ్మింటన్‌ స్టార్ సైనా నెహ్వాల్ సైలెంట్‌గా జ‌రిగింది.ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా పెళ్లి చేసుకుంది సైనా.త‌న తోటి ప్లేయర్ అయిన పారుపల్లి కశ్యప్ ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ సైనా.వీరిద్ద‌రి వివాహ‌నికి రెండు కుటుంబాల‌తో పాటు ,అతి స‌న్నిహితులు మాత్ర‌మే హ‌జ‌రైయ్యార‌ని తెలుస్తుంది.వివాహ అనంతరం ‘నా జీవితంలో ఇదే గొప్ప మ్యాచ్‌’ అంటూ సైనా ట్వీట్‌ చేశారు. పెళ్లి బంధంతో ఒక్కటయ్యామని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.ఈ నెల 16న హైటెక్‌ సిటీలోని నోవాటెల్‌ హోటల్‌లో రిసెప్షన్‌ ఇవ్వనున్నారు.

ఈ వేడుకల్లో బాలీవుడ్, టాలీవుడ్‌ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, దగ్గుబాటి సురేష్‌లతో పాటు ‘అగిలే గ్రూప్‌ హైదరాబాద్‌ హంటర్స్‌’ చీఫ్‌ ఎండీవీఆర్‌కే రావు, మంత్రి కేటీఆర్, చాముండేశ్వరీనాథ్, రాజకీయ ప్రముఖులకు రిసెప్షన్‌కు ఆహ్వానించిన‌ట్లు తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -