- Advertisement -
ఐపీఎల్ 2018 సీజన్లో భాగంగా ముంబయి ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఇప్పటి వరకు 10 మ్యాచ్లాడిన కోల్కతా జట్టు ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. నాల్గింటిలో గెలుపొందిన ముంబయి ఇండియన్స్ జట్టు ఐదో స్థానంలో ఉంది.గెలవాల్సిందే.
ఆదివారం వాంఖడే వేదికగా ఈ రెండు జట్లూ తలపడగా.. ముంబయి ఇండియన్స్ జట్టు 13 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఓటమికి బదులు తీర్చుకోవాలని కోల్కతా ఆశిస్తుండగా.. ప్లేఆఫ్ ఆశలు నిలుపుకోవాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో గత మ్యాచ్ జోరుని కొనసాగించాలని ముంబయి ఇండియన్స్ ఉవ్విళ్లూరుతోంది.