Monday, April 29, 2024
- Advertisement -

ఐపీఎల్ స‌మ‌రం : టాస్ గెలిచి ఫిల్డీంగ్ ఎంచుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్

- Advertisement -

రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్-11లో ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీని విజయంతో ఆరంభించిన రెండు జట్లూ రెండో మ్యాచ్‌లో ఓడి అనంతరం.. వరుసగా రెండు విజయాలతో ఇప్పుడు మంచి జోరుమీదున్నాయి.

విధ్వంసక హిట్టర్ క్రిస్‌గేల్ ఫామ్‌లోకి వచ్చి పరుగుల వరద పారిస్తుండటంతో.. పంజాబ్‌ జట్టు ఫుల్ ఖుషీగా బరిలోకి దిగుతోంది. హిట్టర్ ఆండ్రీ రసెల్, రాబిన్ ఉతప్ప భారీ షాట్లు ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లని బెంబేలెత్తిస్తుండగా.. నితీశ్ రానా, కెప్టెన్ దినేశ్ కార్తీక్ గెలుపు లాంఛన ఇన్నింగ్స్‌లతో టోర్నీ ఆరంభం నుంచి ఆకట్టుకుంటున్నారు.ఇరు జట్లలోనూ హిట్టర్లు ఉండటంతో.. మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.

మోహిత్ శర్శ స్థానంలో అంకిత్ రాజ్‌పుత్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు అశ్విన్ వెల్లడించాడు. కోల్‌కతా జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నట్లు దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -