ఐపీఎల్లో ఎట్టకేలకు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు మొదటి విజయాన్ని అందుకుంది. వరుసగా ఆరు మ్యాచ్ లల్లో ఓటమిచెందిన కోహ్లీసేన 7 వ మ్యాచ్లో విజయం సాధించింది. కోహ్లి పట్టుదల, డివిలియర్స్ మెరుపులు.. రాయల్ చాలెంజర్స్కు తొలి విజయాన్ని అందించాయి. బౌలర్లు కాస్త రాణించడం.. బ్యాటింగ్లో టాపార్డర్ దుమ్మురేపడం.. ఆఖర్లో స్టొయినిస్ ధనాధన్ బ్యాటింగ్.. అన్ని కలిసొచ్చి.. పంజాబ్ కింగ్స్ ఎలెవన్పై విజయాన్ని అందుకుంది.
ఇదలా ఉంటె మ్యాచ్ గెలిచినకోహ్లీకి షాక్ తగిలింది.ఈ మ్యాచ్లో బెంగులూరు స్లో ఓవర్ రేటు కారణంగా కెప్టెన్ కోహ్లీకి రూ.12లక్షలు జరిమానా పడింది. దీంతో ఈ సీజన్లో కోహ్లీకి తొలి విజయంతో పాటు తొలి జరిమానా కూడా పడినట్లైంది.ఐపీఎల్లో స్లో ఓవర్ రేట్ను ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి కింద లెక్కగడతారు. దీంతో కోహ్లీకి మ్యాచ్ ఫీజులో కోత తప్పలేదు.శనివారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ జట్టు 8 వికెట్లతో పంజాబ్పై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే