Monday, April 29, 2024
- Advertisement -

కోహ్లీసేన ఓడిపోవ‌డానికి కార‌ణాలు ఇవే…

- Advertisement -

ఐపీఎల్ 2018 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ ఎట్టకేలకి బోణి కొట్టింది. టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ముంబయి జట్టు మంగళవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 46 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (94: 52 బంతుల్లో 10×4, 5×6), ఓపెనర్ ఎవిన్ లావిస్ (65: 42 బంతుల్లో 6×4, 5×6) దూకుడుగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో విరాట్ కోహ్లి (92 నాటౌట్: 62 బంతుల్లో 7×4, 4×6) చివరి వరకూ ఒంటరి పోరాటం చేసినా బెంగళూరు జట్టుని ఓటమి నుంచి రక్షించలేకపోయాడు.

కోహ్లీ సేన ఓడిపోవ‌డానికి కార‌ణాలు చాలానే ఉన్నాయి. మొద‌ట బెంగళూరు జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా కనిపించాయి. చివ‌రికి ఫ‌లితం మాత్రం తారుమారు అయ్యింది. తుది జట్టు ఎంపిక, బ్యాటింగ్ ఆర్డర్‌‌లో అనుభవరాహిత్యం కారణంగా బెంగళూరు జట్టు టోర్నీలో మూడో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. తొలి ఓవర్‌లోనే ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ చెలరేగి.. మొదటి రెండు బంతుల్లోనే వరుసగా ముంబయి ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (0), ఇషాన్ కిషన్‌ (0)ని క్లీన్‌బౌల్డ్ చేసి 0/2తో బెంగళూరుకి తిరుగులేని ఆరంభమిచ్చాడు. కానీ.. ఆ జట్టు ఈ ఆరంభాన్ని వినియోగించుకోలేకపోయింది.

పేలవ ఫీల్డింగ్, లయ తప్పిన బౌలింగ్‌ కారణంగా 12వ ఓవర్‌ వరకూ మరో వికెట్ పడగొట్టలేకపోయింది. దీంతో.. రోహిత్ – లావిస్ జోడి మూడో వికెట్‌కి అభేద్యంగా 108 పరుగుల భాగస్వామ్యంతో జట్టుని తిరుగులేని స్థితిలో నిలిపారు

బెంగళూరు బ్యాటింగ్ ఆర్డర్‌ని ఎంచుకునే విధానంలోనూ కోహ్లి పొరపాటు చేసినట్లు కనిపిస్తోంది. విధ్వంసక ఓపెనర్‌ మెక్‌కలమ్‌ని పక్కన పెట్టి అతని స్థానంలో ఆల్‌రౌండర్ కోరె అండర్సన్‌‌కి తుది జట్టులో స్థానం కల్పించాడు. మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ చేసిన అండర్సన్ 47 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. బ్యాట్‌తో మాత్రం ఆడిన తొలి బంతికే డకౌటయ్యాడు.

టోర్నీ ఆరంభం నుంచి మెక్‌కలమ్ సూపర్ ఫామ్‌లో లేని మాట వాస్తవమే కానీ.. అతను జట్టులో ఉండింటే జట్టు బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలంగా ఉండేది. డికాక్ (19), డివిలియర్స్ (1) ఔటవగానే కోహ్లీ మినహా జట్టు‌లో గెలిపించే సత్తా ఉన్న బ్యాట్స్‌మెన్ ఎవరూ కనిపించలేదు. మన్‌దీప్ సింగ్ (16), వాషింగ్టన్ సుందర్ (7), సర్ఫరాజ్ ఖాన్ (11) అనుభవరాహిత్యం స్పష్టంగా కనబడింది. దీంతో జ‌ట్టు స‌మ‌తేకం త‌ప్పింది. 0/2తో ఇన్నింగ్స్ ఆరంభించిన ముంబయి జట్టు చివరికి 213 పరుగులు చేయగా.. ఛేదనలో 4.1 ఓవర్లకి 40/1తో నిలిచిన బెంగళూరు జట్టు ఓడిపోవడానికి కారణం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -