Friday, May 3, 2024
- Advertisement -

టాస్‌గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన‌..

- Advertisement -

ఐపీఎల్-11లో వాంఖడే స్టేడియంలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. సీజన్‌లో వరుసగా మూడు పరాజయాలు ఎదుర్కొన్న ముంబయి ఇండియన్స్.. ఆడిన మూడింటిలో కేవలం ఒక్క మ్యాచ్‌లో గెలుపొందిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆసక్తికర పోరుకు రెడీ అయ్యాయి. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ముంబైకి బ్యాటింగ్ అప్పగించాడు

ఇరుజట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. బ్రెండన్ మెక్‌కలమ్, ఖేజ్రోలియా, పవన్ నేగి స్థానంలో మహ్మద్ సిరాజ్, కోరె ఆండర్సన్, సర్ఫరాజ్ ఖాన్ తుది జట్టులోకి తీసుకున్నట్లు విరాట్ వెల్లడించాడు. మరోవైపు యువ స్పిన్నర్ ధనంజయ స్థానంలో మెక్లెనగన్‌ను ఎంపిక చేసినట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు. రెండు జట్లు ఎలాగైనా నేటి మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలని పట్టుదలగా ఉన్నాయి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: క్వింటన్ డీకాక్ (కీపర్), విరాట్ కోహ్లి (కెప్టెన్), ఏబీ డివిలియర్స్, మన్‌దీప్ సింగ్, కోరె అండర్సన్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, క్రిస్ వోక్స్, ఉమేష్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్

ముంబై ఇండియన్స్ జట్టు: సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లెవిస్, ఇషాన్ కిషన్ (కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్య, హార్దిక్ పాండ్య, మిచెల్ మెక్‌క్లెనాగన్, యమాంక్ మార్కాండే, జస్ప్రీత్ బుమ్రా, ముస్తఫిజుర్ రహ్మాన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -