Tuesday, April 16, 2024
- Advertisement -

రోహిత్ శర్మకి ఆసీస్ బౌలర్లతో సవాల్ తప్పదు : హస్సీ

- Advertisement -

భారత ఓపెనర్ రోహిత్ శర్మకి ఆసీస్ బౌలర్లతో పెద్ద సవాల్ ఎదురు కాబోతుందని ఆ దేశ మాజీ క్రికెటర్ మైకేల్ హస్సీ అన్నారు. ఈ ఏడాది చివర్లో ఆసీస్ పర్యటనకి భారత జట్టు వెళ్ళనుంది. అక్కడ డిసెంబరు 3 నుంచి జనవరి 7 వరకూ నాలుగు టెస్టుల సిరీస్‌‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. గత పర్యటనలో ఆసీస్ ని టెస్టుల్లో 2-1 తేడాతో ఓడించిన టీమిండియా .. ఏడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఆ గడ్డపై టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

2019, అక్టోబరు వరకూ టెస్టుల్లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ.. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌తో అనూహ్యంగా ఓపెనర్‌గా అవతారమెత్తి సంచలన ఇన్నింగ్స్‌లు ఆడేశాడు. మూడు టెస్టుల ఆ సిరీస్‌లో వరుసగా 176, 127, 212 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఓపెనర్‌గా గత ఏడాది మొత్తంగా 92.66 సగటుతో ఏకంగా 556 పరుగులు చేశాడు. దాంతో.. అదే జోరుని ఆస్ట్రేలియా గడ్డపైనా రోహిత్ శర్మ కొనసాగించాలంటే ఆ దేశ బౌలింగ్‌ అటాక్‌ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హస్సీ చెప్పుకొచ్చాడు.

” ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఏ బ్యాట్స్ మెన్ కైనా సవాలే. కానీ.. రోహిత్ శర్మ టాప్ ఆర్డర్‌లో సుదీర్ఘకాలంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. గత ఏడాది నుంచి టెస్టుల్లోనూ అతను జోరందుకున్నాడు. కాబట్టి.. ఆస్ట్రేలియా గడ్డపైనా రోహిత్ శర్మ అదే జోరుని కొనసాగిస్తాడని నా నమ్మకం. కానీ ఆస్ట్రేలియా పిచ్‌లపై.. అదీ టాప్ క్లాస్ బౌలింగ్ అటాక్‌ని ఎదుర్కోవడం రోహిత్ శర్మకి సవాలే’’ అని హస్సీ వెల్లడించారు.

ధోనీ ఇంకో 10ఏళ్లు క్రికెట్ ఆడుతాడు : హస్సీ

గంభీర్, కోహ్లీ గొడవ గురించి చెప్పిన రజత్ భాటియా

బుమ్రా నోబాల్‌ కారణంగా పాక్ తో భారత్‌ ఓడిపోయింది : భువనేశ్వర్

కోహ్లీ కంటే రోహిత్ శర్మనే బెస్ట్ కెప్టెన్ : కృష్ణప్ప గౌతమ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -