Wednesday, May 8, 2024
- Advertisement -

మ‌మ‌తా బెనర్జీని ఆశ్ర‌యించ‌నున్న ష‌మీ భార్య‌….

- Advertisement -

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై కేసులు పెట్టి న్యాయ పోరాటం చేస్తున్నకేసులో మ‌రో ట్విస్ట్ చోటు చేసుకుంది. ష‌మీ భార్య హసీన్ జాహన్.. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అపాయింట్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. ఇప్పటికే ఆమె ఫిర్యాదు మేరకు షమీపై గృహ‌ హింస‌, హత్యాయత్నం కేసులు నమోదు చేసిన కోల్‌కతా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

వెంటనే షమీని అరెస్టు చేయాలని గత నాలుగు రోజులుగా పోలీసుల్ని డిమాండ్ చేస్తున్న ఆమె.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అపాయింట్‌మెంట్ కోసం మంగళవారం దరఖాస్తు చేసుకుంది. ఇది ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది.

షమీ ఓ సెలబ్రిటీ.. కాబట్టి అతను నన్ను ఏమైనా చేయగలడు. అతడ్ని అరెస్టు చేసేందుకు నాకు సహకరించండి. షమీ నాతో పాటు చాలా మంది మహిళల జీవితాల్ని నాశనం చేశాడు. నేను ఏమీ పేరు ప్రఖ్యాతల కోసం షమీని పెళ్లిచేసుకోలేదు. ఇంకా చెప్పాలంటే.. పెళ్లినాటికి అతను టీమిండియాలో లేడు. దుబాయ్ హోటల్‌లో పాకిస్థాన్ మహిళ అలిష్బాని బ్రేక్‌ఫాస్ట్ కోసం కలిశానని షమీ చెప్తున్నాడు.. మరోవైపు అలిష్బా.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షమీతో పరిచయం ఏర్పడిందని చెప్తోంది. షమీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని నేనే ఆపరేట్ చేస్తున్నా. నాకు తెలియకుండా ఈ పరిచయం ఏర్పడిందా..? షమీ గురించి చాలా విషయాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయి’ అని హసీన్ జాహన్ వెల్లడించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -