కొద్దిరోజులక్రితం టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై వ్యక్తిగత ఆరోపణ (వివాహేతర సంబంధాలు, గృహహింస)లతో పాటు, కెరీర్కు సంబంధించి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసి పెను కలకలమే రేపింది అతని భార్య హసిన్ జహాన్. దీంతో బీసీసీఐ అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆమెను విచారన సమయంలో యూటర్న్ తీసుకుంది. సుమారు మూడు గంటలపాటు జరిగిన విచారణలో పలు ప్రశ్నలకు తడబాటుకు లోనవుతూ, కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉండటం తెలిసిందే
తన భర్త షమీ ఫిక్సింగ్కు పాల్పడ్డాడంటూ తాను ఆరోపించినట్లు వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు హసీన్ జహాన్. ఇంగ్లండ్కు చెందిన మమ్మద్ బాయ్ అనే వ్యక్తి సాయంతో పాకిస్తాన్కు చెందిన అలిషబా అనే మహిళ నుంచి తన భర్త షమీ డబ్బులు తీసుకున్నాడని మాత్రమే చెప్పానన్నది సారాంశం. తనకు అసలు క్రికెట్ ఆట గురించే ఎలాంటి అవగాహన లేదని, అలాంటప్పుడు భర్త షమీ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని ఎలా ఆరోపిస్తానని జహాన్ ప్రశ్నించడంపై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. షమీ కెరీర్ కు ఏ ఇబ్బంది లేదంటూ క్రికెటర్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
మరో వైపు హసీన్ జహాన్ ఫోన్ ఆడియో టేపుల్లో భర్తతో నగదు గురించి గొడవపడుతున్నట్టు బీసీసీ అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. దీనిపై త్వరలోనే పూర్తిస్థాయి నివేదిక బీసీసీఐకి అధికారులు అందించనున్నారు. ఆ తరువాతే షమీ కెరీర్ పై సస్పెన్స్ వీడిపోతుందని తెలుస్తోంది.