Tuesday, May 21, 2024
- Advertisement -

క్రికెట‌ర్ ష‌మీకి షాక్ ఇచ్చిన ఆమెరికా ఎంబ‌సీ…. జోక్యం చేసుకున్న‌ బీసీసీఐ

- Advertisement -

విండీస్ ప‌ర్య‌ట‌న‌కు వెల్లే టీమిండియా జ‌ట్టులో మ‌హ‌మ్మ‌ద్ ష‌మీని ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే మ్యాచ్‌లు అమెరికాలో ఆడ‌నుంది. విండీస్ టూర్‌కు వెల్లేందుకు పాస్‌పోర్ట్ కోసం ష‌మి అమెరికా ఎంబ‌సీకి ద‌ర‌ఖాస్తు చేస్తున్నాకు. అయితే వీసా ఇవ్వ‌కుండా నిరాక‌రించింది. అయితే బీసీసీఐ జోక్యం చేసుకోవ‌డంతో ఎట్ట‌కేల‌కు వీసీ మంజూరు చేసింది.

షమీ మీద అత‌ని భార్య కేసు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఆ కేసులు ఇంకా కొన‌సాగుతున్నాయి. దీంతో పోలీసుల రికార్డు స‌రిగా లేని కార‌ణంగా అత‌నికి వీసా ఇచ్చేందుకు సందేహం వ్య‌క్తం చేసింది. కోల్‌క‌తాలో ష‌మీపై గృహ‌హింస చ‌ట్టాల కింద ఛార్జ్‌షీట్ దాఖ‌లైంది. బీసీసీఐ జోక్యం చేసుకుంది. క్రికెట‌ర్ ష‌మీ దేశానికి ఎంతో సేవ చేశాడ‌ని, అత్యుత్త‌మ బౌల‌ర్ అని బీసీసీఐ అమెరికా ఎంబ‌సీకి వెల్ల‌డించింది. దీంతో ఎంబ‌సీ అధికారులు ష‌మీకి వీసా జారీ చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈనెల 29వ తేదీన వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉంది.విండీస్ టూర్ కోసం ఇండియన్ టీమ్ అమెరికా మీదుగా వెళ్లి రావాల్సి ఉంటుంది. అందు కోస‌మే ష‌మీ అమెరికా వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -