భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ టీ20 జట్టులోకి వచ్చాడు. ఇటీవల ధోనీ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ వన్డే జట్టులో చోటు కోల్పోయాడు. వన్డే సిరీస్ల్లో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో తలపడే భారత వన్డే టీమ్ను బీసీసీఐ ప్రకటించింది.
పేలవ ఫామ్ కారణంగా టీ20 జట్టులో చోటు కోల్పోయిన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి మళ్లీ వన్డే, టీ20 జట్టులో భారత సెలక్టర్లు చోటు కల్పించారు. దీంతో మూడు నెలల తర్వాత జట్టులోకి ధోని రానున్నారు. మరోవైపు ఆసియా కప్లో గాయపడిన హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరిస్తో పునరాగమనం చేయనున్నాడు. దినేశ్ కార్తీక్ వన్డే, టీ20 జట్టులో రెండో వికెట్ కీపర్గా తన స్థానాన్ని నిలబెట్టుకోగా.. రిషబ్ పంత్ మాత్రం కేవలం టీ20లకే అవకాశమిచ్చారు.
భారత జట్టుకు తొలి టీ20 ప్రపంచకప్ను అందించిన మహేంద్ర సింగ్ ధోనీని వెస్టిండీస్, ఆస్ట్రేలియాలతో జరిగిన టీ20 సిరీస్లకు ఎంపిక చేయని విషయం తెలిసిందే.ఆస్ట్రేలియాతో జనవరి 12 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆడనున్న భారత్.. ఆ తర్వాత జనవరి 23 నుంచి న్యూజిలాండ్తో ఐదు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది.
భారత జట్టు..:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, మహ్మద్ షమీ.