ఐపీఎల్ 17వ సీజన్లో ఎట్టకేలకు ఖాతా తెరిచింది ముంబై. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓటమి తర్వాత గెలుపు బాట పట్టింది ముంబై. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 29 పరుగుల తేడాతో గెలుపొందింది. ముంబై విధించిన 235 పరుగుల లక్ష్యచేధనలో 208 పరుగులు చేసింది ఢిల్లీ. దీంతో ఈ సీజన్లో తొలి విక్టరీని నమోదు చేసింది.
ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ (49), ఇషన్ కిషన్ (42), టిమ్ డేవిడ్ (45), హర్ధిక్ పాండ్యా (39), సేపర్ద్ (39) పరుగులు చేయగా ఢిల్లీ బ్యాట్స్మెన్లో పృధ్వీ షా (66), అభిషేక్ పొరల్ (41),స్టుబ్స్ 25 బంతుల్లో 71 పరుగులు చేసి ఢిల్లీని విజయతీరాల వరకు తీసుకెళ్లాడు. కానీ మరో ఎండ్లో తనకు సహఖరించేవారు లేకపోవడంతో ఓటమి పాలయ్యారు.
ఇక మరో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 163 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక గుజరాత్ 130 పరుగులకే ఆలౌట్ గా నిలిచింది. ఇక ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది కోల్ కతా.