- Advertisement -
సిరీస్ లక్ష్యంగా న్యూజిలాండ్ గెడ్డ మీద అడుగుపెట్టిన టీమిండియా మొదటి మ్యాచ్లోనే తన సత్తాను చాటింది. కివీస్తో జరుగుతున్న 5 వన్డేల సిరీస్లో మొదటి వన్డే మ్యాచ్ బుధవారం మొదలైంది. నేపియర్ వేదికగా మొదటి వన్డే ప్రారంభం అయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్కు ఆ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. ఓపెనర్లు గుప్టిల్(5), మున్రో(8)లను మహ్మద్ షమీ తన వరుస ఓవర్లలో క్లీన్బౌల్డ్ చేశాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన లాథమ్(11), రాస్ టేలర్(22) లను చహల్ పెవిలియన్కు పంపించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు తనదైన శైలిలో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ అర్థసెంచరీతో రాణించాడు. కుల్దీప్ (4/39), షమీ(3/19), చహల్( 2/43), కేదార్ జాదవ్(1/17)లు చెలరేగటంతో 38 ఓవర్లలో 157 పరుగులకే కివీస్ జట్టు ఆలౌటైంది.