న్యూజిలాండ్ పర్యటనలో భారత్ తొలి ఓటమిని చూసింది. బుధవారం హామిల్టన్లోని సెడాన్ పార్కు వేదికగా జరిగిన తొలి వన్డేలో నాలుగు వికెట్లతో భారత్ ను కివీస్ ఓడించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 347 పరుగుల భారీ స్కోరును సాధించింది. కెరీర్లో శ్రేయస్ అయ్యర్ (103) కెరీర్లో తొలిసెంచరీతో అద్భుతంగా ఆడాడు. కేఎల్ రాహుల్ (88 నాటౌట్) అజేయ అర్ధసెంచరీ చేయగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (51) ఫిఫ్టీతో రాణించాడు.
అనంతరం న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో 6 వికెట్లకు 348 పరుగులు చేసి గెలుపొందింది. వెటరన్ రాస్ టేలర్ (109 నాటౌట్) సెంచరీతో రాణించాడు. కీవీస్ ఒపెనర్లు మార్టిన్ గప్తిల్ (32), హెన్సీ నికోల్స్ (78) మంచి స్కోర్ చేశాడు. భారత బౌలర్లను ఎదుర్కుంటున్న ఈ జంట.. మొదటి వికెట్ కు 85 పరుగులు జోడించి మంచి ఇన్నింగ్స్ నిర్మించారు. ఈక్రమంలో టేలర్.. టామ్ లాథమ్ (69)తో కలిసి జట్టును విజయం వైపు నడిపించారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 138 పరుగులు జోడించి భారత్ ఆటగాళ్లకు టెన్షన్ పెట్టారు. నిజానికి ఛేదనలో కివీస్కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (32), హెన్రీ నికోల్స్ (78) శుభారంభం అందించారు.
భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ జంట.. తొలి వికెట్కు 85 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను నిర్మించారు. అయితే కుదురుగా సాగుతున్న ఈ జోడీని శార్దూల్ ఠాకూర్.. గప్తిల్ను ఔట్ చేసి విడదీశాడు. అనంతరం టామ్ బ్లండెల్ (9) త్వరగానే పెవిలియన్కు చేరాడు. ఈదశలో నికోల్స్-టేలర్తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు.ఫిఫ్టీ అయ్యాక లాథమ్ను ఔట్ చేసిన భారత్.. జజేమ్స్ నీషమ్ ((9), గ్రాండ్హోమ్ (1)ను పెవిలియన్కు పంపింది. అయితే మరో ఎండ్లో సెంచరీ పూర్తి చేసుకున్న టేలర్ చివరకు విజయం వైపు మ్యాచ్ ను మలిచాడు.