ముక్కోణపు టీ 20 సిరీస్లో భాగంగా శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా ఫీల్డింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. వరుణుడు అడ్డుతగలడంతో ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అవుతోంది.
వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన నేటి మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించారు. మైదానంలో జల్లులు కారణంగా పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. ఆలస్యంగా ప్రారంభం అవుతుండడంతో ఈ మ్యాచును 19 ఓవర్లకు కుదించారు. టీమిండియాలో ఒక్క మార్పు మాత్రమే చోటు చేసుకుంది. రిషబ్ పంత్ స్థానంలో కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చాడు. మొదటి మ్యాచులో శ్రీలంక చేతిలో ఓడిపోయిన టీమిండియా ఈ మ్యాచులోనయినా గెలవాలని పట్టుదలతో ఉంది. లంకతో జరిగే ఈ మ్యాచ్లో భారత్ కశ్చితంగా గెలవాల్సిందే.
ఈ ముక్కోణపు టి20 టోర్నీలో ఇప్పటి వరకైతే భారత్ బ్యాటింగ్ ఫర్వాలేదు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్తో పాటు, నిలకడలేని బౌలింగ్ జట్టు యాజమాన్యాన్ని కలవరపరుస్తోంది. రెండు మ్యాచ్ల సస్పెన్షన్ వేటు పడటంతో చండిమాల్ స్థానంలో తిసారా పెరీరా లంకకు సారథ్యం వహించనున్నాడు.