ముక్కోణపు టీ 20 సిరీస్ల్లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో లంకపై భారత్ ఘనవిజయం సాధించింది. మ్యాచ్లో భారత ఆటగాడు కేఎల్ రాహుల్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఇప్పటి వరకు ఏ భారత ఆటగాడు హిట్ వికెట్ రూపంలో ఔటవ్వలేదు. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ హిట్ వికెట్ రూపంలో వెనుదిరిగి భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో హిట్ వికెట్ రూపంలో వెనుదిరిగిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
లంకేయులతో మ్యాచ్లో రిషబ్ పంత్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన రాహుల్ 18 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. జీవన్ మెండిస్ వేసిన 10 ఓవర్ ఐదో బంతిని లెగ్ సైడ్కు తరలించి సింగిల్ తీసే క్రమంలో వికెట్లను కాలితో తాకి పడగొట్టాడు. ఇక్కడ రాహుల్ కాలు వికెట్లను తాకి బెయిల్స్ పడగొట్టిన విషయం బ్యాట్స్మన్తో పాటు వికెట్ కీపర్ కుశాల్ పెరీరా కూడా గమనించలేదు. ఇదే సమయంలో బౌలర్ మెండిస్ సంబరాలు చేసుకోవడంతో రాహుల్ అవుటైన విషయం తెలిసింది.
వన్డేల్లో నలుగురు భారత ఆటగాళ్లు మాత్రమే హిట్ వికెట్గా వెనుదిరిగారు. 1995లో పాకిస్తాన్తో జరిగిన వన్డే మ్యాచ్లో నయాన్ మోంగియా హిట్ వికెట్గా అవుటయ్యాడు. దాంతో వన్డేల్లో హిట్ వికెట్గా అవుటైన తొలి భారత ఆటగాడిగా నయాన్ నిలిచాడు. ఆ తర్వాత అనిల్ కుంబ్లే(2003, న్యూజిలాండ్పై), సచిన్ టెండూల్కర్(2008, ఆస్ట్రేలియా), విరాట్ కోహ్లి(2011, ఇంగ్లండ్)లు ఉన్నారు. కాకపోతే టెస్టుల్లో, వన్డేల్లో హిట్ వికెట్గా అవుటైన ఏకైక క్రికెటర్ మాత్రం కోహ్లినే.