Sunday, May 12, 2024
- Advertisement -

క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్‌కు శ్రీలంక ప్ర‌త్యేక ఆహ్వానం…

- Advertisement -

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కి శ్రీలంక ప్రత్యేక ఆహ్వానం పంపింది. తమ దేశ 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరుకావాలంటూ ఆయనకు ఓ లేఖ పంపింది.కొలంబో వేదికగా మంగళవారం నుంచి ఆరంభంకానున్న ముక్కోణపు టీ20 సిరీస్‌‌ను వీక్షించేందుకు శ్రీలంకకి రావాల్సిందిగా ఆ దేశ క్రికెట్ బోర్డు లేఖ‌లో పేర్కొంది. 70 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవానికి గుర్తుగా శ్రీలంక ఈ సిరీస్‌ను నిర్వహిస్తుండగా.. ఆతిథ్య జట్టుతో పాటు భారత్, బంగ్లాదేశ్ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఒక్కో జట్టు.. మిగిలిన రెండు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడనుండగా.. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మార్చి 18న ఫైనల్లో ఢీకొట్టనున్నాయి. ఈరోజు రాత్రి 7 గంటలకి భారత్, శ్రీలంక మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

1998లో 50 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవానికి గుర్తుగా అప్పట్లో ముక్కోణపు సిరీస్‌ని వన్డే ఫార్మాట్‌లో శ్రీలంక నిర్వహించింది. ఇందులో లంకతో పాటు భారత్, న్యూజిలాండ్ జట్లు పోటీపడ్డాయి. శ్రీలంకతో జరిగిన ఆ టోర్నీ ఫైనల్లో సౌరవ్ గంగూలీతో కలిసి సచిన్ టెండూల్కర్ తొలి వికెట్‌కి 252 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇప్పటికీ క్రికెట్ చరిత్రలో తొలి వికెట్‌కి ఈ రికార్డు భాగస్వామ్యం టాప్-10 లిస్ట్‌లో ఉంది

అయితే బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోతున్నానని సచిన్ సమాధానం పంపారు. లంక ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల పంపిన లేఖకు ఆయన ఈ మేరకు స్పందించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -