ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య రసవత్తర పోరు ఆరంభమైంది. ఈ మ్యాచ్ పాక్కు చావో రేవో లాంటిది. ఈ మ్యాచ్లో 500 పైచిలుకు పరుగులు చేసి బంగ్లాను తక్కువకు ఆలౌట్ చేస్తే గాని సెమీస్కు వెల్లలేని పరిస్థితి. టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లా టీమ్లో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. షబ్బీర్, రుబెల్ స్థానంలో మహ్మదుల్లా, మెహిదీ హసన్ జట్టులోకి వచ్చినట్లు బంగ్లా సారథి మష్రాఫీ తెలిపాడు.
ఈ మ్యాచ్లో పాకిస్థాన్ 350 పరుగులు చేసి 311 పరుగులతో, 400 పరుగులు చేస్తే 316 రన్స్, 450 పరుగులు చేస్తే 321 రన్స్ తేడాతో బంగ్లాను పాక్ చిత్తుగా ఓడించాల్సి ఉంటుంది. సాంకేతికంగానే సెమీఫైనల్ రేసులో నిలిచిన పాకిస్థాన్ చివరి లీగ్ మ్యాచ్లో అసాధారణ విజయం సాధించాల్సి ఉంటుంది. పాక్ సెమీస్ అవకాశాలు ఇంగ్లండ్ భారత్, న్యూజిలాండ్పై గెలవడంతో పొగొట్టుకుంది.