ఐపీఎల్లో కప్ సాధించాలన్న ఆర్సీబీ కల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్తో నెరవేరిందా?,మరి ఈ ఏడాది జరిగే ఐపీఎల్లో ఆర్సీబీ మెన్స్ టీం ఏం చేయనుంది? ఇప్పుడు క్రీడాభిమానులు దీనిపైనే చర్చిస్తున్నారు. ఎందుకంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సెకండ్ సీజన్ విజేతగా నిలిచింది ఆర్సీబీ ఉమెన్స్ టీం.
ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది. ఢిల్లీ విధించిన 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూపాడుతూ చేధించింది. 19 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కొల్పోయి టార్గెట్ని చేధించగా డివైన్ 32,స్మృతి మందన 31,ఎల్లిస్ పెర్రి 35 పరుగులతో రాణించారు. ఆర్సీబీ విజయంతో ఈ ఎఫెక్ట్ పురుషుల టీంపై పడింది.
ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్ గెలవలేదు ఆర్సీబీ. ప్రతీ సీజన్లో భారీ అంచనాలతో బరిలోకి దిగడం చివరకు చతికిలపడటం పరిపాటిగా మారింది. ఇలాంటి తరుణంలో ఉమెన్స్ టీం కప్ గెలవడంతో పురుషుల టీంపై ఒత్తిడి పెరిగింది. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్లో చెన్నైతో తలపడనుంది ఆర్సీబీ.