Saturday, April 20, 2024
- Advertisement -

వన్డే, టెస్ట్ సిరీస్ లకు రోహిత్ దూరం.. టీమిండియాకు షాక్..!

- Advertisement -

ఆదివారం న్యూజిలాండ్‌తో చివరి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో భారత్ సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇక న్యూజిలాండ్‌-భారత్ జట్లు మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ వన్డే సిరీస్ కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది.

ఓపెనర్ ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్ శర్మ గాయం కారణంగా.. వన్డే, టెస్ట్ సిరీస్‌లకు దూరమయ్యాడు. ఈ విషయంను బీసీసీఐ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపినట్టు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. ఇక రోహిత్ కు బదులుగా మయాంక్ అగర్వాల్ కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఈ నెల 5న హామిల్టన్ వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఫిబ్రవరి 8న ఆక్లాండ్ వేదికగా రెండో వన్డే, ఫిబ్రవరి 11న బే ఓవల్ వేదికగా మూడో వన్డే జరగనుంది.

వన్డే జట్టు ఈ విధంగా ఉంది. విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), మయాంక్ అగర్వాల్/శుభమాన్ గిల్, పృథ్వీ షా, లోకేష్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్‌ పాండే, రిషబ్ పంత్, కేదార్‌ జాదవ్, శివమ్‌ దూబే, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, నవదీప్ సైనీ, శార్దుల్‌ ఠాకూర్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -