ఆదివారం న్యూజిలాండ్తో చివరి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో భారత్ సిరీస్ను 5-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇక న్యూజిలాండ్-భారత్ జట్లు మూడు వన్డేల సిరీస్కు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ వన్డే సిరీస్ కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది.
ఓపెనర్ ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ గాయం కారణంగా.. వన్డే, టెస్ట్ సిరీస్లకు దూరమయ్యాడు. ఈ విషయంను బీసీసీఐ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపినట్టు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. ఇక రోహిత్ కు బదులుగా మయాంక్ అగర్వాల్ కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఈ నెల 5న హామిల్టన్ వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఫిబ్రవరి 8న ఆక్లాండ్ వేదికగా రెండో వన్డే, ఫిబ్రవరి 11న బే ఓవల్ వేదికగా మూడో వన్డే జరగనుంది.
వన్డే జట్టు ఈ విధంగా ఉంది. విరాట్ కోహ్లీ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్/శుభమాన్ గిల్, పృథ్వీ షా, లోకేష్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, నవదీప్ సైనీ, శార్దుల్ ఠాకూర్.