ఐపీఎల్ 2018లో ముంబై ఇండియన్స్కు ఏమాత్రం కలిసి రాలేదు.ఈ ఐపీఎల్లో ఆడిన 8 మ్యాచ్లలో 2 మాత్రమే కలిసి 6 మ్యాచ్లు ఓడిపోయింది.ముంబైలో గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. విజయం మాత్రం దక్కడం లేదు.ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమిపై ముంబై సారధి రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తి వెల్లడించారు. తమ జట్టు ఆటతీరుపై ఆయన తీవ్ర నిర్వేదం వ్యక్తం చేశారు.
‘ఈ మ్యాచ్లో ఓటమి తీవ్రంగా బాధిస్తుంది. దీనికి మమ్మల్ని మేమే నిందిచుకోవాల్సి ఉంటుంది. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడం మ్యాచ్ని దెబ్బతీసింది. ఈ మ్యాచ్లో రోహిత్ గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. దాదాపు ఐపీఎల్ టైటిల్ రేస్ నుండి ముంబై తప్పుకున్నట్లే.మూడుసార్లు ఐపీఎల్ టైటిల్ వినర్స్గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో పూర్తిగా నిరాశ పరిచింది.