ఐపీఎల్ తాజా సీజన్లో అన్ని జట్లు ప్లే ఆఫ్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. నిన్నటి వరు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న కోహ్లీ టీం , కొంచెం పైకి ఎగబాకింది. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో బెంగుళూరు రాయల్ ఛలెంజర్స్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో పోటీపడింది. 17 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసింది.
డివిలియర్స్ (82 ),చాలా రోజులు తరువాత తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించాడు. అతనికి తోడుగా స్టొయినిస్ (46 నాటౌట్) చెలరేగారు. తరువా భారీ లక్ష్యంతో బరిలోకి దిగిప పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 185 పరుగులు చేసి ఓడింది. పూరన్ (46), రాహుల్ ( 42) రాణించినప్పటికి తమ జట్టకు విజయాన్నిందించలేకపోయారు. డివిలియర్స్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ విజయంతో పాయింట్ల పట్టికలో రాజస్తాన్ రాయల్స్ను కిందకు పడేసి ఏడో స్థానంతో కాస్త మెరుగైంది. ప్లే–ఆఫ్ రేసులో నిలిచింది.
- Advertisement -
ప్లే–ఆఫ్ రేసులోరాయల్ చాలెంజర్స్ బెంగళూరు
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -