Thursday, May 9, 2024
- Advertisement -

మ‌మ‌తా బెన‌ర్జీని క‌ల‌వ‌నున్న ష‌మీ భార్య‌ హసీన్ జహాన్

- Advertisement -

టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీకేసు రోజుకొక మ‌లుపు తిరుగుతోంది. వివాహేత‌ర సంబంధాలు క‌లిగిఉన్నాడి ష‌మీపై చేస‌ని ఆరోప‌న‌ల‌తో అతని భార్య హసీన్ జహాన్ కొన్ని రోజులుగా వార్తల్లో వ్యక్తులుగా మారారు. తన భర్తపై వివాహేతర సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలై ష‌మీమీద కేసు న‌మోద‌య్యింది. హసీన్…తాజాగా తన గోడును వినిపించేందుకు పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసేందుకు సిద్ధమవుతోంది.

సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని నిన్న కలిసేందుకు ప్రయత్నించగా అది కుదరలేదని, ఈ నెల 23న ఆమెను కలుస్తానని చెప్పింది. తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని, షమీని, అతని కుటుంబసభ్యులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేసింది.

మరోవైపు మహ్మద్ షమీపై జహాన్ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ చేపట్టిన బీసీసీఐ గతనెల 17, 18 తేదీల్లో అతను దుబాయ్‌లోనే ఉన్నట్లు ధ్రువీకరించింది. గతనెలలో దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత పాకిస్థాన్ మోడల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న షమీ ఆమెని కలవడానికి దుబాయ్ వెళ్లాడని జహాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -