Friday, May 17, 2024
- Advertisement -

బీసీసీఐ అధ్య‌క్షుడి రేసులో మాజీ కెప్టెన్‌….

- Advertisement -

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రేసులో ఉన్నాడ‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం బీసీసీఐ కొత్త రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు ఆమోదించిన విషయం తెలిసిందే. ఒక రాష్ట్రం-ఒక ఓటు నిబంధన రద్దవగా.. బోర్డులో పదవీకాలం మధ్య విరామం వెసులబాటు కూడా పెరగడంతో గంగూలీకి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది.

బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) అధ్యక్షుడిగా ప్రస్తుతం పనిచేస్తున్న సౌరవ్ గంగూలీ.. మ్యాచ్‌లకు కామెంటేటర్‌గానూ పనిచేస్తున్నాడు. వాస్తవానికి 2015లో అప్పటి అధ్యక్షుడు జగన్మోహన్ దాల్మియా గుండె పోటుతో మరణించడంతో గంగూలీ ఆ బాధ్యతలు చేపడతాడని అందరూ ఊహించారు. కానీ.. అనూహ్యంగా అనురాగ్ ఠాకూర్‌ తెరపైకి వచ్చారు. అయితే.. తాజాగా గంగూలీ కోరుకుంటే.. అతను అధ్యక్షుడు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలాడిన గంగూలీ.. అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. ముఖ్యంగా.. టీమిండియాకి దూకుడు నేర్పిన కెప్టెన్‌గా అతను చరిత్రలో నిలిచిపోయాడు. 2008, నవంబరులో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన గంగూలీ.. ఆ తర్వాత బీసీసీఐ‌తో కలిసి దేశంలో క్రికెట్ అభివృద్ధి‌కి పనిచేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -